Wednesday, November 21, 2018

20.11.2018 విజేతలకు బహుమతుల పంపిణి

విజేతలకు బహుమతుల పంపిణి 


గిద్దలూరు పట్టణంలో గల గ్రంధాలయం నందు నవంబర్ 14 నుండి 20 వరకు జరిగిన గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా ఈ రోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు గ్రంధాలయ వారోత్సవ ముగింపు సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంనకు గిద్దలూరు నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డిగారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా గ్రంథాలయ పాలకుడు రామక్రిష్ణారెడ్డి గారు, మండల విద్యాశాఖాధికారి సూర కాశిరంగారెడ్డిగారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి లక్ష్మీదేవి గారు ఎం ఎల్ ఏ గారిని పూల మాలతో సత్కరించడం జరిగినది. ఈ క్రమంలో గ్రంధాలయం వారు విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎం ఎల్ ఎ ముత్తుముల అశోక్ రెడ్డి గారి చే మెమోంటోలను అంద జేయడం జరిగినది. ఈ కార్యక్రమం నందు దప్పిలి కాశిరెడ్డిగారు, సిఐ శ్రీరామ్ గారు,రిటైర్డ్ లెక్చరర్ నారాయణ రెడ్డిగారు మరియు పాఠశాల నందలి ఉపాధ్యాయ ఉపాధ్యాయునులు, విద్యార్థినులు పాల్లొనడం జరిగినది.