Wednesday, August 30, 2017

తెలుగు భాషా దినోత్సవం


స్థానిక శాఖా గ్రంధాలయంలో జరిగిన తెలుగు బాషా దినోత్సవ కార్యక్రమము 

తెలుగుభాష తీయదనం.. తెలుగుభాష గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం.. ఓ సినీకవి కలం నుంచి జాలువారిన అక్షర సత్యం ఇది. అమ్మా అనే పిలుపుతోనే తెలుగు మాధుర్యాన్ని పంచుతుంది.నేడు వ్యవహారిక భాషా ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి పంతుల జయంతి. తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.



Wednesday, August 16, 2017

Independence Celebrations At Giddalur Library

గిద్దలూరు టౌన్ స్థానిక గ్రంధాలయ కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమ సభలో పాల్గొన్న పాతాల నాగేశ్వర స్వామి చైర్మన్ శివాపురం ఆంజనేయులు గారు ,స్థానిక గ్రంధపాలకులు గొలమారి రామక్రిష్ణ రెడ్డి గారు ,యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సయద్ ఫరూక్ ,జి జగదీశ్వర రెడ్డి ,కిరణ్ ,రమేష్ ,గౌతమ్ ,సాయి కృష్ణ , చిన్ని ట్రస్ట్ నిర్వాహకులు శ్రీకాంత్,గ్రంధ పాఠకులు మరియు MPP స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .



Independence Day Celebration At Giddalur Library 

ఆంధ్ర  ప్రభ పత్రిక