బాల బాలికలకు చిత్రలేఖనం పోటీలు
గిద్దలూరు గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వరోత్సవాల్లో భాగంగా చిత్రలేఖన పోటీలను శనివారం నిర్వహించినట్లు స్థానిక గ్రంథాలయాధికారి గొలమారి రామకృష్ణ రెడ్డి తెలిపారు. స్థానిక గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన ఈ పోటీల్లో అధిక శాతం మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేస్తామన్నారు.